తెలంగాణ

Harish Rao: ప్రతీ అంశంలో రేవంత్‌రెడ్డి ప్లేటు ఫిరాయిస్తున్నారు

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ప్రతీ అంశంలో రేవంత్‌రెడ్డి ప్లేటు ఫిరాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని ఆయన ధ్వజ‌మెత్తారు.

భూముల వేలంపై మారిన రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరి వేసుకునే పరిస్థితి నెలకొందని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము అంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఇపుడు వేల కోట్ల విలువైన భూములను అర్రాస్ వేసేందుకు తెరలేపిండని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button