తెలంగాణ
Chamala Kiran Kumar Reddy: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది

Chamala Kiran Kumar Reddy: దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణలో కులగణన చేశామని ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మాట ఇస్తే సీఎం, మంత్రులు, ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తుందన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు కానీ మహరాష్ట్రలో బీజేపీ సర్కార్ అభివృద్ధి వైపు కాకుండా ఔరంగజేబు సమాధి తీద్దామనే ఆలోచనతో ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు .