News
Southwest Monsoon: ఈసారి ముందే.. అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon: అండమాన్ నికోబార్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దాదాపు ఈ నెల 27వ తేదీ కి కేరళ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తోంది. జూన్ 12కు తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈసారి సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో మరో వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ముగుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే చివరి రోజుల్లో పగటి పూట అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది వాతావరణ శాఖ.