ఆంధ్ర ప్రదేశ్
Prakasam: ప్రకాశం జిల్లాలో విషాదం.. ఐదుగురు గల్లంతు.. ముగ్గురి మృతి

Prakasam: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. ఐదుగురిలో ముగ్గురు మృతి చెందగా..మరొకరు గల్లంతయ్యారు. ఒకరిని మత్స్యకారులు రక్షించారు. మృతులంతా పొన్నలూరు మండలం తిమ్మపాలెంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాలను కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.