తెలంగాణ
Uttam Kumar reddy: కృష్ణా నదీ జలాల సమస్యలో కేంద్రం జోక్యం చేసుకోవాలి

Uttam Kumar reddy: కృష్ణా జలాల సమస్యలో కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతీయ నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం సందర్భంగా మంత్రి ఉత్తమ్ , కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబాషిష్ ముఖర్జీ, ఐఎఎస్లతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పిఆర్ఎల్ఐఎస్, సీతారాం సాగర్, సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే మూసీ పునరుజ్జీవనం కోసం గోదావరి-మూసీ లింక్ కోసం నిధులు ఇవ్వాలని మంత్రి కోరారు.