తెలంగాణ
తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం.. డిప్యూటీ సీఎం భట్టికి లేఖ రాసిన కిషన్ రెడ్డి

Kishan Reddy: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపీల సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టికి లేఖ రాశారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. అయితే భేటీకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. లేఖ ఆలస్యంగా అందడంతో పార్టీలో చర్చించుకునేందుకు సమయం దొరకలేదని లేఖలో పేర్కొన్నారు.
ఇక ఇప్పటికే నిర్ణయించుకున్న అధికార-అనధికార కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోతున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే తెలియజేయాలని కోరుతున్నట్లు లేఖలో వెల్లడించారు కిషన్ రెడ్డి. ఇక తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.