ఆంధ్ర ప్రదేశ్

AP Budget: 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

Atchannaidu: దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌ను ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి తెలిపారు.

రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్‌ భారత్‌ 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button