ఆంధ్ర ప్రదేశ్
Vangalapudi Anitha: యోగా జీవన విధానంలో భాగం కావాలి

Vangalapudi Anitha: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ గణబాబు,అధికారులు పాల్గొన్నారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం గర్వకారణం అన్నారు హోంమంత్రి అనిత.
యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు. మనస్సుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు. యోగా మన జీవన విధానం లో భాగం కావాలని సూచించారామె. జూన్ 21న జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారని హోం మంత్రి అనిత తెలిపారు.