తెలంగాణ
Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టు షాక్

Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టు షాక్ ఇచ్చింది . కంచ గచ్చిబౌలి భూముల ఘటనలో నకిలీ వీడియోలు వైరల్ చేశారని పోలీసుల ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని క్రిశాంక్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విచారణకు సహకరించాలని ఆయన్ను ఆదేశించింది. కొణతం దిలీప్నకు నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించి తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
ఒకే ఘటనపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది రమణారావు కోర్టుకు వెల్లడించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలి భూముల ఘటనపై AI వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేసి వైరల్ చేశారని.. సీఎంపై అనుచిత పోస్టులు పెట్టారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.