PM Modi: విమానం కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మోదీ

PM Modi: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు.
మరోవైపు ఎయిరిండియా ఎండీ, సీఈఓ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు కూడా అహ్మదాబాద్కు చేరుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాగీలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు.