Manmohan Singh: దేశం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది.. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం..

Manmohan Singh: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా ప్రముఖులు సంతాపం తెలిపారు.
ప్రధాని మోదీ: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారు. పార్లమెంట్లో ఆయన చేసిన ప్రసంగాలు అద్భుతమైనవి.
ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనప్పటి వెంటనే, ఢిల్లీలోని ఎయిమ్స్లో అత్యవసర చికిత్స కోసం చేరారు. చికిత్స పొందుతున్నా, ఆయన తుదిశ్వాస విడిచారు.
రాష్ట్రపతి ముర్ము: భారత్ ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయం జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మృతి దేశానికి తీరనిలోటు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
రేవంత్ రెడ్డి : మన్మోహన్ సింగ్ మృతికి సీఎం రేవంత్ సంతాపం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్సింగ్ ఒక లెజెండ్. మన్మోహన్ దేశానికి ఎనలేని సేవలు అందించారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, మహానాయకుడు, సంస్కరణ వాది అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని సీఎం పేర్కొన్నారు.
Dk.అరుణ : – ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు & మహబూబ్నగర్ ఎంపీ Dk.అరుణ దిగ్భ్రాంతి. ఈ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆర్థిక వేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఆయన సేవలు మరుచలేనివి. మన్మోహన్ సింగ్ గారి పవిత్ర అత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్ష. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
రాహుల్ గాంధీ: గురువు, మార్గదర్శిని కోల్పోయాను. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారు. ఆర్థికశాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తి. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ: రాజకీయాల్లో కొంత మంది నేతలు మంది మాత్రమే స్ఫూర్తిగా నిలుస్తారు. ఆయన నిజాయతీ మాకు ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేసినా నిబద్ధతతో దేశానికి సేవ చేశారు. కఠినమైన రాజకీయ ప్రపంచంలో ప్రత్యేక గౌరవప్రదమైన, సున్నిత వ్యక్తిగా చివరి వరకు కొనసాగారు అంటూ ప్రియాంక సంతాపం తెలిపారు.
మల్లికార్జున ఖర్గే : మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. మన్మోహన్ను దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో గుర్తు పెట్టుకుంటుంది.