ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరులో టెన్షన్.. టెన్షన్.. సోమశిల ప్రాజెక్ట్ సందర్శనకు వైసీపీ పిలుపు

నెల్లూరులో ఉద్రిక్తత తలెత్తింది. సోమశిల ప్రాజెక్ట్ సందర్శనకు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీమంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్తో పాటు పలువురు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి.. రోడ్డుపై బైఠాయించారు. ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.



