తెలంగాణ సీఎం రేవంత్ కీలక నిర్ణయం

Revanth Reddy: తెలంగాణలో సీఎ రేవంత్రెడ్డి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను మార్చడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ వంటి సీనియర్ మంత్రులను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం వెను కేవలం పరిపాలనాపరమైన కారణాలే ఉన్నాయా లేకా పార్టీ లో అంతర్గతంగా ఉన్న ఇతర కారణాలు కారణమా సీఎం ఎంతో మేమూ అంతే అని వారు అంటున్నారా.. తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
అత్యుత్సాహమే… వాళ్ల బాధ్యతలను మార్చిందా..? నోటి దురుసే… వాళ్ల కొంప ముంచిందా..? వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారా..? అవుననే అంటున్నాయి సచివాలయ వర్గాలు. జిల్లాల ఇంఛార్జి మంత్రుల్లో జరిగిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏకంగా ముగ్గుర్ని తొలగించింది రేవంత్ ప్రభుత్వం. వాళ్లను తొలగించడానికి అసలు కారణమేంటి..? ఇప్పుడు అందరి నోటా ఇదే మాట. ముగ్గురు సీనియర్ మంత్రుల తోకలు కావాలనే సీఎం రేవంత్ రెడ్డి కట్ చేశారా…? లేక మరో ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కడం వల్లనే మార్పు జరిగిందా..? ముఖ్యమంత్రి స్పెషల్ ట్రీట్మెంట్తో ఎవరికెంత లాభం..?
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అందరిలోనూ పలు అనుమానాలు రేకేత్తిస్తోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను మార్చి షాకిచ్చారు సీఎం రేవంత్. కేబినెట్లోకి ముగ్గురు కొత్త మంత్రులను తీసుకోవడంతో మార్పులు చేర్పులు చేశారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రుల విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకు ఇంఛార్జ్ మినిస్టర్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖలను ఆ బాధ్యతల నుంచి
తప్పించింది.
హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినప్పటికీ కేబినెట్ విస్తరణ పూర్తికాకపోగా స్వల్ప మార్పులు, చేర్పులకు కూడా ఆలస్యమే అయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలకు ఇంఛార్జీలను మంత్రులను మార్చడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ వంటి సీనియర్ మంత్రులను ఇంఛార్జ్ బాధ్యతల నుండి తొలగించడం వెనుక కేవలం పరిపాలనాపరమైన కారణాలే ఉన్నాయా..? లేక పార్టీలో అంతర్గతంగా ఉన్న ఇతర కారణాలే కారణమా..? అనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి.
నిజానికి కరీంనగర్ ఇంఛార్జీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఇంఛార్జీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెదక్ ఇంఛార్జీగా కొండా సురేఖల బాధ్యతల తొలగింపు వెనుక బలమైన రాజకీయ సందేశం దాగి ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ మంత్రులను ఇన్చార్జి బాధ్యతల నుండి తప్పించడంతో ముఖ్యమంత్రి ఎంతో మేమూ అంతే అనే సీనియర్లు అనుకుంటున్నారని గుసగుసలు వినబడుతున్నాయి.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎటువంటి జిల్లా ఇన్చార్జి బాధ్యతలు లేనప్పుడు దశాబ్దాల కాంగ్రెస్ అనుభవం ప్రజాబలం ఉన్న సీనియర్లకు, తమకు మాత్రం ఎందుకు ఒక జిల్లాకు ఇన్చార్జిగా ఉండాలనే అభిప్రాయం ఈ సీనియర్ మంత్రుల్లో బలంగా నాటుకుపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాము కేవలం ఇన్చార్జి మంత్రులుగా పరిమితం కావడం తమ రాజకీయ స్థాయికి తగదని వారు భావిస్తున్నట్లు టాక్.
అయితే ఈ పరిణామం రేవంత్ రెడ్డి నాయకత్వానికి రాబోయే రోజుల్లో పెద్ద సవాలుగా కూడా పరిణమించే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలనను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, పార్టీలో బలమైన, పట్టున్న సీనియర్ల అభిప్రాయాలను పూర్తిగా విస్మరించడం కూడా అంత సులభం కాదనేది వాస్తవం.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నవారే కాకుండా, వారి నియోజకవర్గాల్లో వారి సామాజిక వర్గాల్లో బలమైన పట్టు ఉన్నవారు కూడా. వీరిని కేవలం పరిపాలనాపరమైన కారణాలతోనే తప్పించారా, లేక వారి రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం జరిగిందా అనే సందేహాలు అటు పార్టీ నేతల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
మంత్రి కొండా సురేఖ విషయంలో మాత్రం ఇన్చార్జి బాధ్యతల తొలగింపునకు ఇతర కారణాలు కూడా తోడై ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై మరింత పట్టు సాధించే ప్రయత్నంలో భాగంగానే ఈ మార్పులు చేశారనే వాదన కూడా బలంగా వినబడుతోంది.
జిల్లాలపై పూర్తి పట్టు సాధించి, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా, వేగవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో మరింత చురుకైన, యువ నాయకులకు కొత్త మంత్రులకు అవకాశం కల్పించడానికి సీనియర్లను బాధ్యతల నుండి తప్పించి ఉండవచ్చని ఆలోచన కూడా అందరిలో ఉంది. ఇది సీనియర్లను తక్కువ చేయడం కాదని, కేవలం పనితీరు.. పాలనా సౌలభ్యం ఆధారంగా తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వ వర్గాల్లో అంతర్గత చర్చ నడుస్తోంది.
జిల్లాలకు ఇంచార్జి మంత్రుల తొలగింపు అంశం అనేది వారి అంగీకారంతోనే జరిగిందా ? లేక వారిని పక్కన పెట్టే ప్రయత్నమా అనే చర్చకు స్పష్టమైన సమాధానం లేదు. అయినప్పటికీ ఈ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనేది స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు. పార్టీలో తన పట్టును పెంచుకుంటూ, తన నిర్ణయాలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.
అయితే ఈ ప్రక్రియలో సీనియర్ నాయకుల సేవలను, అనుభవాన్ని ఎలా వినియోగించుకుంటారనేది ఇక్కడ చాలా కీలకం అని చెప్పవచ్చు. వారిని కేవలం కేబినెట్ మంత్రులుగా పరిమితం చేస్తారా, లేక వారికి ఇతర బాధ్యతలేమైనా అప్పగిస్తారా..? అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఏదేమైనా మార్పులు తెలంగాణ ప్రభుత్వంలో మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనకు పరీక్షగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. వాటిని దృష్టిలో పెట్టుకొనే ఈ మార్పులు చేశారా..? లేదా..? మరేదైనా కారణం ఉందా..? అని రాజకీయవర్గాల్లో హాట్ హాట్గా చర్చ నడుస్తోంది.