ఆంధ్ర ప్రదేశ్

TTD: తిరుపతి ఘటన.. బాధితులకు పరిహారం పంపిణీ కోసం 2 బృందాలు

TTD: తిరుపతి ఘటన బాధిత కుటుంబాలకు నేటి నుంచి పరిహారం ఇవ్వనుంది టీటీడీ. దీని గురించి బోర్డు సభ్యులతో 2 బృందాలను నియమించారు పాలక మండలి ఛైర్మన్. ఈ బృందాలు మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు పరిహారం ఇవ్వనున్నారు.

మృతుల కుటుంబాలకు 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన ఇద్దరికి 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు. మరోవైపు.. మృతుల కుటుంబంలో ఒకరికి ఒప్పంద ఉద్యోగం ఇవ్వనున్నారు. దీని కోసం వారి వివరాలను సేకరిస్తోంది టీటీడీ. మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు కూడా చర్యలు తీసుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button