ఆంధ్ర ప్రదేశ్
Anantapur: ఆఫీస్ బాయ్ను చెప్పుతో కొట్టిన సీఐ

Anantapur: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా వివాదంలో చిక్కుకున్నారు. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన హసీనా భాను ఆఫీస్ బాయ్ని చెప్పుతో కొట్టారు. అయితే ఇందులో తనకు సంబంధం ఏమీ లేదంటున్నారు ఆఫీస్ బాయ్.
ప్రస్తుతం అనంతపురం ఎక్సైజ్ పీఎస్లో పంచాయితీ కొనసాగుతోంది. ఎక్సైజ్ సీఐ ఆఫీస్ మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఇక ఎక్సైజ్ హసీనా భాను ఆఫీస్ బాయ్ని చెప్పుతో కొట్టిన వీడియో, సోషల్ మీడియాలో వైరలవుతోంది.