తెలంగాణ

Jana Reddy: తీన్మార్‌ మల్లన్నవి గాలి మాటలు

Jana Reddy: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ఎవరో ఏదో మాట్లాడితే నేను ఎందుకు పట్టించుకుంటాను అన్నారు. గాలి మాటలు మాట్లాడితే కుదరదన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఎవరైనా అడిగితే సలహాలు మాత్రమే ఇస్తానన్నారు.

పరిపాలన చేసే వారు అడిగినా సలహాలు, సూచనలు ఇస్తానని మా పార్టీ నాయకులు నన్ను విమర్శించినా ఖండించటం లేదన్నారు. అలాగని సమర్థించటం కూడా లేదని కారణం ఏంటో వాళ్లనే అడిగి తెలుసుకోండంటూ సూచించారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఏంటీ అనేది ప్రజలే నిర్ణయిస్తారని జానారెడ్డి చెప్పుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button