ఆంధ్ర ప్రదేశ్
Kakinada: బావిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి

Kakinada: కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాద ఘటన చోటు చేసుకుంది.స్నేహితులతో ఆడుకుంటూ బావిలో ఏడేళ్ల బాలుడు పడి మృతి చెందాడు .హేమంత్ అనే బాలుడు ఆడుకుంటుండగా బాలు బావిలో పడింది. బాలు కోసం బావిలో తొంగిచూస్తూ పడిపోయాడుహేమంత్. బావి 40 అడుగుల లోతుగా ఉండటంతో బాలుడిని రెస్క్యూ సిబ్బంది గంటన్నర పాటు శ్రమించి వెలికి తీశారు. బాలుడు మృతితో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.