తెలంగాణ
Telangana: గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు స్టే

Telangana: గ్రూపు-1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు స్టే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. గ్రూప్ 1 నియామాకాలపై విచారణ చేసిన ధర్మాసనం… తదుపరి విచారణ జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గ్రూపు-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 19 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక నిరుద్యోగ అభ్యర్థి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు నియామకాలపై స్టే విధించింది. తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అయితే జూన్ 11న ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.