ఆంధ్ర ప్రదేశ్
CM Chandrababu: ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం

CM Chandrababu: ఏపీకి ప్రధాని మోదీ రాకపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతికి విచ్చేస్తున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు చంద్రబాబు. మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారం మరవలేనిదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్య, ఉపాధి అవకాశాలు సృష్టించేలా అమరావతి ఆవిష్కృతం అవుతోందన్నారు చంద్రబాబు. సంపద సృష్టితో రాష్ట్రానికి అమరావతి చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.