తెలంగాణ
Revanth Reddy: కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారు

Revanth Reddy: సీఎం రేవంత్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్పై.. జానారెడ్డి, కేకేతో చర్చించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. గతంలో మావోయిస్టులతో జానారెడ్డి, కేకే చర్చలు జరిపినట్లు గుర్తుచేశారు. ఇకపై కగార్ వ్యవహారం జానారెడ్డి, కేకే చూసుకుంటారని చెప్పారు. పీస్ కమిటీ రిక్వెస్ట్ను జాతీయ పార్టీకి పంపుతామన్నారు రేవంత్.
అయితే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. మరోవైపు గులాబీ దళపతి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్. బీఆర్ఎస్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు సీఎం. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారన్నారు. ఇక తెలంగాణ ఖజానా అంతా లూటీ చేసింది కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు రేవంత్.