News
Lady Aghori: అఘోరి అలియాస్ శ్రీనివాస్కి 14 రోజుల రిమాండ్

Lady Aghori: అఘోరీ అలియాస్ శ్రీనివాస్కి చేవెళ్ల కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అఘోరిని కంది సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే జైలుకు వెళ్లినా కూడా, భార్య వర్షిణి తనతోనే ఉండాలంటున్నారు అఘోరీ. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నారు.
అంతకుముందు అఘోరీకి డాక్టర్ రాజేంద్రప్రసాద్ వైద్య బృందం పరీక్షలు నిర్వహిం చింది. కాగా యూపీలో తెలంగాణకి చెందిన అఘోరిని అరెస్ట్ చేసిన పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. 2గంటలపాటు విచారించారు పోలీసులు.