తెలంగాణ
లింగంపల్లి రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత

లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రైలు మార్గంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కోణార్క్ కెక్స్ప్రెస్లో గంజాయి బ్యాగును రైల్వే పోలీసులు గుర్తించారు. ఆ బ్యాగులో 6 లక్షల విలువ గల 13 ప్యాకెట్ల గంజాయిని సీజ్ చేశారు. ఆ బ్యాగ్ను ఎవరు పెట్టారు అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.