తెలంగాణ
కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి

ములుగు జిల్లా మంగపేట గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. దీంతో సుమారు 3 లక్షల వరకు నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం నుండి మేకలను దిగుమతి చేసుకుని, ఇంటి వెనకాల ఉంచడంతో రాత్రి కుక్కలు దాడికి పాల్పడ్డాయి.
గొర్రెల యజమాని ఉదయం చూసేసరికి 30 గొర్రెలు మృతిచెందాయి. అధికారులు కుక్కల నియంత్రన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.