జాతియం

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్

Gyanesh Kumar: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. అంతకుముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ CEC పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సభ్యులుగా ఉన్నా రు. సీఈసీ పదవికి ఎంపిక చేసిన పేరును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటన వెలువడింది.

ప్రస్తుత సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పదవీకాలం నేటితో ముగియనుండగా ఎంపిక కమిటీ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో సమావేశమైంది. సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్‌ను సీఈసీగా నియమిస్తుంటారు. దానినే కొనసాగిస్తూ.. రాజీవ్‌ కుమార్‌ తర్వాత సీనియర్‌ అయిన జ్ఞానేశ్‌ కుమార్‌ను సీఈసీ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌.. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర వహించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button