ఆంధ్ర ప్రదేశ్
Nellore: వ్యక్తిని హత్య చేసి చెత్తకుప్పలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Nellore: నెల్లూరు నగరంలో మరో దారుణ హత్య జరిగింది. ప్రగతి నగర్లో వ్యక్తిని హత్య చేసి గుర్తు తెలియని దుండగులు చెత్తకుప్పలో పడేశారు. మృతుడు కార్ డ్రైవర్ వాసుగా గుర్తించారు. అర్ధరాత్రి హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల నెల్లూరులో వరుస హత్యలు జరుగుతున్నాయి. వరుస హత్యలపై నెల్లూరు వాసులు భయాందోళనకు గురైతున్నారు.