తెలంగాణ
Maoist Party: ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నాం’.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

Maoist Party: మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామంటూ లేఖలో పేర్కొంది. అదేవిధంగా శాంతి చర్చలు జరపాలని BRS పార్టీ, గులాబీ దళపతి కేసీఆర్ కోరారంటూ గుర్తుచేసింది.
రజతోత్సవ సభలో కూడా శాంతి చర్చల తీర్మానం చేశారంటూ లేఖలో వివరించింది. సీఎం రేవంత్ రెడ్డి, MLC కవిత లాంటి రాజకీయ నేతలు శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు లేఖలో పేర్కొంది. ఇలాంటి పరిణామాలపై తాము హర్షిస్తున్నామంటూ మావోయిస్టులు తెలిపారు.