తెలంగాణ
HCUకి సుప్రీంకోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ

HCUకి సుప్రీంకోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చేరుకుంది. కంచ గచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించినట్లు తెలుస్తుంది. అక్కడి పరిస్థితులను రికార్డు చేసినట్లు సమాచారం. ఇటీ వల HCU భూముల విషయంలో రాష్ట్ర సర్కార్ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ప్రకృతికి జరిగిన నష్టంపై కమిటీ ఆరా తీసినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని విద్యార్థులను కలవనీయకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈస్ట్ క్యాంపస్కి వెళ్లే రహదారికి అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈస్ట్ క్యాంపస్లోకి అకడమిక్ పనులకు వెళ్తున్న విద్యార్థులు, ప్రొఫెసర్లను కూడా వెళ్లనీయకుండా అడ్డగించారు పోలీసులు.