ఆంధ్ర ప్రదేశ్
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో డ్రోన్ నిఘా

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో పోలీసులు నిఘా పెంచారు. శ్రీశైలంలోని పార్కింగ్ స్థలాల్లో పేకాట ఆడుతున్న భక్తులను పోలీసులు డ్రోన్ సహాయంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సుమారు 40 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 62 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.