ఆంధ్ర ప్రదేశ్

గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్

విజయవాడలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి కేసులో ఏ-1గా ఉన్న ఓలుపల్లి రంగారావును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత రంగారావు అజ్ఞాతంలోకి వెళ్లారు. సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు. రంగారావును విజయవాడ కోర్టులో హాజరు పరిచే అవకాశముంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button