ఆంధ్ర ప్రదేశ్
AP High Court: నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట

AP High Court: నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదు పరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
పోసానిపై ఆదోని పోలీసుల పీటీ వారెంట్ అమలైనందున పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. దీంతో పద్మనాభం, సూళ్లూరుపేట పీఎస్ లలో నమోదైన కేసుల్లో విచారణ సోమవారానికి వాయిదా పడింది.