ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామన్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారని అన్నారు. బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎక్కడ విభేదాలకు తావులేదన్నారు. పార్టీలో గ్రూపులను సహించనని చంద్రబాబు హెచ్చరించారు.