తెలంగాణ
Eatala Rajendar: కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు.. బీఆర్ఎస్ను నమ్మరు

Eatala Rajendar: కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ ను నమ్మరు. ఈసారి బీజేపీకే అవకాశం ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటికే పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయిందని ప్రజలు బాధపడుతున్నారని వెల్లడించారు.
కాంగ్రెస్ పాలనపై మాట్లాడుతున్న ఒకే పార్టీ బీజేపీ ఒక్కటేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రేవంత్ రెడ్డికి దమ్ములేదన్నారు ఈటల. రాజకీయాలు పూలబాట కాదు ముల్లబాట అన్నారు. హుజురాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల పాల్గొన్నారు.