తెలంగాణ
Kishan Reddy: 14 నెలల కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉంది

Kishan Reddy: సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 14 నెలల మీ పాలన అసంతృప్తిగా ఉందని కిషన్రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెన్ఫిట్స్ చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయమన్నారు. ఉద్యోగులకు రోటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటని అన్నారు.
కళాశాల యాజమాన్యాలకు ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని కిషన్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తున్నారని లేఖలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.