ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణ ముమ్మరం

Tirumala: తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా చిక్కుముడులు వీడుతున్నాయి. A8 కలీముల్లాఖాన్ కోసం సీబీఐ అండ్ సిట్ వేట కొనసాగుతుంది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లో కలీముల్లాఖాన్ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కలీముల్లాఖాన్ను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా ఇప్పటికే పలువురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే వారిని ఆధారాలతో సహా నిందితులను ప్రశ్నించారు. వీడియో, ఆడియో, ఫోటో ఆధారాలతో ప్రశ్నించిన ట్లు తెలుస్తుంది. ఇక కస్టడీ పొడిగించాలని కోర్టును సీబీఐ అండ్ సిట్ మరోసారి కోరనున్నట్లు సమాచారం. ఇక రేపు నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది.