జాతియం

1984 సిక్కుల ఊచకోత కేసులో.. దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ..

ఈ కేసు నవంబర్ 01, 1984 జస్వంత్ సింత్, అతడి కుమారుడు తరణ్ దీప్ సింగ్ హత్యలకు సంబంధించింది. పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్ మొదట కేసు నమోదు చేసినప్పటికీ, ఆ తర్వాత దీనిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. డిసెంబర్ 16, 2021న, కోర్టు కుమార్‌పై అభియోగాలు మోపింది. ఇతడి ప్రమేయం ఉన్నట్లు తేల్చింది. మారణాయుధాలతో సాయుధులైన ఒక భారీ గుంపు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి పెద్ద ఎత్తున దోపిడీలు, దహనాలతో పాటు సిక్కుల్ని టార్గెట్ చేశారు.

ఈ గుంపు తమ ఇంటిపై దాడి చేసి తన భర్త, కొడుకును చంపినట్లు జస్వంత్ సింగ్ భార్య ఫిర్యాదు చేసింది. ఇంట్లో వస్తువుల్ని దోచుకుని వారి ఇంటిని తగులబెట్టినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. సజ్జన్ కుమార్‌పై విచారణ జరుపుతూ.. అతను కేవలం అందులో పాల్గొనే వాడు మాత్రమే కాదని, ఆ గుంపుకు నాయకత్వం వహించాడు…అందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button