ఆంధ్ర ప్రదేశ్
Vijayawada: ఘరానా మోసం.. ఓం ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరిట.. అక్రమంగా డబ్బులు వసూళ్లు

Vijayawada: విజయవాడ భవానీపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓం ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరిట.. అనుమతులు లేకుండా అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు దాడులు చేశారు. మహిళలనే టార్గెట్గా చేస్తున్నట్లు గుర్తించారు.
45 రోజుల్లో రుణాలు ఇస్తామంటూ.. ప్రతి మహిళ వద్ద వేయి 800 రూపాయలు వసూలు చేసి నట్లు నిర్ధారించారు. 600 మంది మహిళల వద్ద సుమారు 12లక్షలు వసూలు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే.. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వెనకబడిన తరగతుల వారి కోసం.. ఇచ్చే రుణ పత్రాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు.