జాతియం

మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ఇంటికి నిప్పు పెట్టారు. బంగబంధుగా పేరొందిన షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ చారిత్రక నివాసంపై దాడి చేసి.. కొందరు నిరసనకారులు నిప్పంటించారు. పదవి కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్‌ హసీనా సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్‌ పార్టీకి హసీనా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఢాకాలో ఘటనలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇంటికి నిప్పు పెట్టడంపై సైతం ఆమె స్పందించారు. భవనాన్ని కూల్చివేయగలరు.. కానీ, చరిత్రను కాదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button