జాతియం
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. పది కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 7కోట్ల 8లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. మిలాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా బంగారం దొరికింది. బంగారం అక్రమ తరలింపునకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.