ఆంధ్ర ప్రదేశ్
Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల

Tirumala: తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని.. ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. భక్తులు గ్యాలరీల్లోకి ప్రవేశించే, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.