Tirupati: మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

Tirupati: తిరుపతి జిల్లా నగిరి మండలం కావేటిపురంలో మూడున్నరేళ్ల చిన్నారిపై మోహన్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి తల్లిదండ్రులపై వైసీపీ క్యాడర్ దాడికి పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై హోంమంత్రి అనిత బాధిత కుటుంబంతో ఫోన్ మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఇదే ఘటనపై ఎంపీ ప్రసాదరావు విచారం వ్యక్తం చేశారు. చిన్నారి నుంచి శాంపిల్స్ ల్యాబ్ కు పంపించామన్నారు. ల్యాబ్ రిపోర్ట్ రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
నిందితుడు మోహన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు నగరి డీఎస్పీ అజీజ్ . నగరి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేక.. చిన్నారిని తిరుపతి తీసుకొచ్చామన్నారు. ఈ కేసును రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. గ్రామస్తుల మధ్య గొడవకు, చిన్నారిపై లైంగిక దాడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కావేటిపురంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు డీఎస్పీ.