తెలంగాణ
Crime News: దారుణం.. తండ్రిని గొంతు కోసి చంపిన కొడుకు

Crime News: మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. తండ్రి రాజయ్యను కొడుకు గొంతు కోసి చంపేశాడు. ఈ హత్యకు మరో కొంతమంది సహకరించినట్లు సమాచారం. ఇక తండ్రిని చంపిన అనంతరం నిందితుడు సిద్ధార్థ్ జైపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఘటన వెలుగులోకి రాగా.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.