ఆంధ్ర ప్రదేశ్

Guntur: మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి కమిషనర్‌ డుమ్మా .. మేయర్ మనోహర్ నాయుడు తీవ్ర ఆగ్రహం

Guntur: గుంటూరు మున్సిపల్ కమిషనర్, మేయర్ మధ్య వివాదం కొనసాగుతుంది. గుంటూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి కమిషనర్‌ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్‌ కావట్టి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద సహాయం పేరుతో ఖర్చుపెట్టిన నిధులకు లెక్క చెప్పాల్సి వస్తుందని కారణంతోనే కమిషనర్‌ సమావేశాలకు రావట్లేదని ఆయన ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

మేయర్ నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సిందేనని అన్నారు. ఈనెల 4న జరిగిన సమావేశంలో విజయవాడ వరదల సహాయం కింద ఖర్చుపెట్టి అంశం మీద ప్రశ్న లేవనెత్తామన్నారు. ఆ సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అప్పటి నుంచి కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button