ఆంధ్ర ప్రదేశ్
Chittoor: రోడ్డు ప్రమాదం.. 15 మందికి గాయాలు

Chittoor: చిత్తూరు జిల్లా మొగలిఘాట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను వెనుక నుంచి ఢీకొని.. డివైడర్ పైకి దూసుకెళ్లింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ. దీంతో.. బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు. అతివేగంతో వెళ్తున్న టెంపో.. ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేయడంతో ఘటన చోటుచేసుకుంది.