అంతర్జాతీయం
Saudi Bus Accident: సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 తరాల 18 మంది మృతి చెందారు. సౌదీ అరేబియాలోని మదీనాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబాన్ని మూడు తరాల అగ్నికి ఆహుతయ్యాయి. ఉమ్రా పూర్తిచేసుకొని మదీనాకు తిరుగు ప్రయాణంలో ఉన్న హైదరాబాద్ కుటుంబానికి చెందిన 18 మంది తొమ్మిది మంది పెద్దలు, తొమ్మిది మంది పిల్లలు క్షణాల్లో మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఇంటికి చేరుకోవాల్సిన వారు మృత్యువాత పడ్డారు.
సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 42 మంది భారతీయ యాత్రికులలో ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది సభ్యులు, వారిలో తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. హైదరాబాద్కు చెందిన ఈ కుటుంబం శనివారం తిరిగి రావాల్సి ఉందని వారి బంధువులు తెలిపారు.



