ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన పవన్

Pawan Kalyan: తిరుపతి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన పవన్, అక్కడ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మంగళ ప్రాంతంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
తరువాత తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అటవీ శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అటవీ సంరక్షణ, అక్రమ రవాణా నిరోధక చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం.



