టాలీవుడ్
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది..

Manchu Vishnu: మంచు విష్ణు మరో వివాదంలో చిక్కుకున్నారు. జల్పల్లిలో మంచు విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందులను వేటాడారు. వణ్యప్రాణులను వేటాడొద్దని చెప్పినా పట్టించుకోలేదు.
అయితే మంచు విష్ణు, మనోజ్ ఇంట్లో లేని సమయంలో వేటాడినట్లు తెలుస్తుంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.