ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో వర్షం

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తిరుమలలో వేకువజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో దర్శనానంతరం గదులకు వెళ్లేందుకు, లడ్డూ విక్రయ కేంద్రాలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు.
వర్షం ప్రభావంతో తిరుమలలో చలితీవ్రత పెరిగింది. దీంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు..



