ఆంధ్ర ప్రదేశ్

AP News: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్.. ఉత్తర్వులు జారీ ప్రభుత్వం

AP News: ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.

దీంతో నూతన సీఎస్‌గా విజయానంద్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎల్లుండి మధ్యాహ్నం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కె. విజయానంద్ ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఏడాది నవంబరు నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button