ఆంధ్ర ప్రదేశ్

ఉత్తరాంధ్రుల కల సాకారం … భోగాపురం ఎయిర్ పోర్ట్ లో విమానం చక్కర్లు

ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయం నిర్మిస్తున్నారు. విమానాశ్రయం పనుల్లో భాగంగా కీలక ముందడుగు పడింది. భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కాబోతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా కీలక ముందడుగు పడింది. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ట్రయల్ రన్ నిర్వహించింది. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. రన్‌వే, సిగ్నల్ వ్యవస్థ వంటి పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే ఈ ATC టవర్ నుంచి వచ్చే సంకేతాలపై AAI, DGCA సంస్థలు పరీక్షలు నిర్వహించాయి. చిన్న విమానంతో ట్రయల్ రన్ చేస్తూ ఈ పరీక్షలు చేశారు.

భోగాపురం విమానాశ్రయంలో ఒక విమానం చక్కర్లు కొట్టింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానంతో పరీక్షలు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం రన్‌వేకు దగ్గరగా వచ్చి ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నించింది. కానీ మళ్లీ పైకి ఎగిరిపోయింది. ఆ విమానం ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ సముద్రం వైపు వెళ్లిపోయింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు దీన్ని ఆశ్చర్యంగా చూశారు.

కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సిగ్నల్, రన్‌వే టెస్టు కోసం విమానం వచ్చిందని భావిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న విమానాశ్రయ పరిస్థితి, చేయాల్సిన పనులు, చిన్నచిన్న మార్పులు, అడ్డంకులను పరిశీలించడానికి అప్పుడప్పుడు నిర్వాహకులు విమానంతో ట్రయల్ రన్ నిర్వహించారు. రాష్ట్ర విడిపోయిన తర్వాత పదేళ్ల తర్వాత విమానం ఎగరడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆశ్చర్యంగా చూశారు.

ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు రోడ్ల కోసం భూసేకరణ పనులు కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎన్‌హెచ్ 16 నుంచి ఎయిర్‌పోర్టు వరకు అనుసంధాన రహదారి కోసం భోగాపురం మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో 60 ఎకరాలను సేకరించారు. ఇందులో భూ నిర్వాసితులకు 20.22ఎకరాలకు పరిహారం చెల్లించారు. సవరవిల్లి పరిధిలో 39.86 ఎకరాలకు సంబంధించి 45 మందికి చెల్లించాల్సిన 19.89 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం న్యాయస్థానంలో డిపాజిట్ చేశారు.

నష్ట పరిహారం చెల్లించి ఉన్న సమస్యలను ప్రభుత్వం క్లియర్ చేస్తూ విమానాశ్రయం నిర్మాణం పనులు చకచక సాగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసుకొని 2026 జనవరి నాటికి ఉత్తరాంధ్ర జిల్లా ల ప్రాంతం అందరికీ చేరువగా విమానాశ్రయం పూర్తి అవుతుంది. 90శాతం పూర్తి కావటంతో ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా విమానాశ్రయం రాబోతుంది

భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు వీలైనంత త్వరగా పనుల్ని వేగవంతం చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. భోగాపురంతోపాటు గన్నవరం, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

ఏపీలో భోగాపురం, గన్నవరం, తిరుపతి కాకుండా మరో నాలుగైదు ఎయిర్‌పోర్టులను నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది . కుప్పంతోపాటు తూర్పుగోదావరిలో ప్లాన్ చేస్తోంది. ఎయిర్ కనక్టవిటీ ఎప్పుడైతే పెరుగుతుందో విదేశీ టూరిస్టులు తాకిడి పెరగడం ఖాయమని అంచనా వేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button