ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: సింగయ్య మృతికి జగన్ నిర్లక్ష్యమే కారణం

YS Sharmila: పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతికి ముమ్మాటికీ జగన్ నిర్లక్ష్యమే కారణమన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. చేసిన తప్పిదానికి క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణమన్నారు. మానవత్వం ఉంటే 5కోట్లో 10కోట్లో పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలి గానీ ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు ప్రజా సమస్యలంటూ బయల్దేరడం విడ్డూరంగా ఉందన్నారు.